Search
Close this search box.

వచ్చే మూడేళ్లలో పాఠశాలల మరింత బలోపేతం

ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లపై నిర్వహించిన సవిూక్షలో ఆయన మాట్లాడారు. సెవిూ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని తెలిపారు. అంగన్‌వాడీ ప్లేస్కూళ్ల తరహాలో మూడో తరగతి వరకు విద్యాబోధనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంగన్‌వాడీ ల్లో విద్యాబోధనకు అదనంగా మరో టీచర్‌ను నియమించాలని కోరారు. నాలుగో తరగతి నుంచి సెవిూ రెసిడెన్షియల్‌ స్కూల్‌ లో చదువుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. సెవిూ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించాలి. విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక ఒకట్రెండు మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాలి. ప్రభుత్వ, సీఎస్‌ఆర్‌ నిధులతో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి‘ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
ఉత్తమ బ్యాంక్ మేనేజర్ రాష్ట్ర స్థాయి అవార్డు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు
ఉమ్మడి కరీంనగర్‌లో భూ ప్రకంపనలు
ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి
Screenshot_20250430-141720
బిచ్కుంద లొ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన జూక్కల్ MLA తోట లక్ష్మీ కాంతారావు