Search
Close this search box.

బాలికపై అత్యాచారం, హత్య కేసులో ముద్దాయికి ఉరి శిక్ష

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సంచ లన తీర్పు వెలువడించింది. బాలిక పై అత్యాచారం హత్య కేసులో ముద్దాయికి ఉరి శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది.

2018లో నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై దినేష్ తాపీ కార్మికుడు అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఈ కేసులో 2021లోనే రంగారెడ్డి కోర్టు దోషికి ఉరిశిక్ష విధించింది.

ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరగ్గా రంగారెడ్డి కోర్టు తీర్పును రాష్ట్ర హైకోర్టు సమర్థించింది.

కాగా, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు సెంట్రింగ్ పనిచేసే కార్మికుడిగా పోలీసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి