Search
Close this search box.

ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డ్‌ రేసులో రోహిత్‌కు షాకిచ్చిన బుమ్రా

జూన్‌ 29న టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్‌ విజయంలో ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో బూమ్‌ బూమ్‌ బుమ్రాకు ఐసీసీ నుంచి అద్భుతమైన రిటర్న గిఫ్ట్‌ దక్కింది. బుమ్రా జూన్‌ 2024 కోసం ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డు కోసం బుమ్రా టీమిండియా సారథి రోహిత్‌ శర్మ, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రహ్మానుల్లా గుర్బాజ్‌లతో పోటీ పడ్డాడు. వీరిద్దరిని అధిగమించిన బుమ్రా ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 30 ఏళ్ల టీమిండియా పేసర్‌.. %ఖూA%, కరేబియన్‌లలో 8.26 సగటుతో 15 వికెట్లు పడగొట్టి, 4.17 ఎకానమీ రేటుతో అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. పురుషుల %ు%20 ప్రపంచ కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డులో విరాట్‌ కోహ్లీ (రెండుసార్లు విజేత)తో కలిసి భారత ఆటగాడిగా చేరాడు. ‘‘జూన్‌ నెలలో %Iజజ% పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా ఎంపికైనందుకు నేను సంతోషిస్తున్నాను. %ఖూA%, వెస్టిండీస్‌లో గడిపిన కొన్ని వారాల చిరస్మరణీయమైన రోజుల తర్వాత ఇది నాకు ప్రత్యేక గౌరవం. టోర్నమెంట్‌లో మేం బాగా ఆడడం, చివర్లో ట్రోఫీని ఎత్తడం చాలా ప్రత్యేకమైనది, నేను ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ నాతో ఉంచుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మహిళల విభాగంలో టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధాన జూన్‌ నెలకుగానూ ఐసీసీ ఉమెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును గెలుచుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన మైయా బౌచియర్‌, శ్రీలంకకు చెందిన విష్మి గుణరత్నేలను ఓడిరచిన, లేడీ విరాట్‌ అంతర్జాతీయ కెరీర్‌లో మొదటిసారి ఈ అవార్డును దక్కించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి