Search
Close this search box.

ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన పార్టీ పార్లమెంట్‌ సభ్యులు సమావేశం

కాకినాడ, జూలై 02 : రాష్ట్ర అభివృద్ధి, పెండిరగ్‌ ప్రాజెక్టులకు సహకరించాలని వినతి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీని జనసేన పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ళ ఉదయ్‌ శ్రీనివాస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలు ఆంధ్రప్రదేశ్‌కు ఉండాలని, రాష్ట్ర అభివృద్ధిని ముందుండి నడిపించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు, రాష్ట్ర విభజన అంశాలు, కేంద్ర నుంచి రావాల్సిన గ్రాంట్లు అంశాలను నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. కాకినాడ పార్లమెంట్‌ పరిధిలో టూరిజం అభివృద్ధికీ, జాతీయ విద్యాసంస్థ నెలకొల్పడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి