Search
Close this search box.

క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు బైబిల్లు పంచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

 Hm9న్యూస్ ప్రతినిథి రాజన్నసిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రభుత్వ ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న లింగాల రాజు అనే ఉపాధ్యాయుడు క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో సుమారు 100 మంది విద్యార్థులకు బైబిల్లను పదిన్నర గంటల ప్రాంతంలో పంపిణీ చేశాడు, ఈ విషయాన్ని పాఠశాల విద్యార్థులు స్థానిక బిజెపి పార్టీ నాయకులకు ఫిర్యాదు చేయగా స్థానిక బిజెపి పార్టీకి చెందిన నాయకులు బొమ్మెడ స్వామి వంగల రాజకుమార్ నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకొని లింగాల రాజు అనే ఉపాధ్యాయుడు పంచిన బైబిల్ల ను విద్యార్థుల నుండి స్వాధీనం చేసుకున్నారు పాఠశాల ఉపాధ్యాయ గదిలో ఉన్న మరో బైబిల్ల ప్యాకింగ్ ను స్వాధీనం చేసుకున్నారు,బిజెపి నాయకులు ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి శ్రీహరికి ఫిర్యాదు చేశారు పంపిణీకి సంబంధించి వీడియోలు తీసిన చిత్రీకరణను బిజెపి నాయకులు ఎంఈఓ కు అందజేశారు,. ప్రభుత్వ పాఠశాలలో వందమంది విద్యార్థులకు క్రిస్మస్ గిఫ్ట్ ల పేరుతో బైబిల్ల ను పంచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింగాల రాజ పై వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని బిజెపి నాయకులు కోరారు, జిల్లా విద్యాధికారికి ఈ సంఘటనపై ఫిర్యాదు చేయనుట్లు వారు తెలిపారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి