Search
Close this search box.

తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి వివరించారు…

తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి వివరించారు. ఈ సర్వే ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ గారితో భేటీ అయ్యారు.

🔹 2025 లో దేశ వ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో తెలంగాణ తరహాలో కుల గణనను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సీఎంగారు గవర్నర్ గారిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని సీఎంగారు చెప్పారు.

🔹 గవర్నర్ గారిని కలసిన వారిలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఎంపీలు పోరిక బలరాం నాయక్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఉమ్మడి కరీంనగర్‌లో భూ ప్రకంపనలు
ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి
Screenshot_20250430-141720
బిచ్కుంద లొ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన జూక్కల్ MLA తోట లక్ష్మీ కాంతారావు
మహబూబాబాద్ టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ కు రివార్డు
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం