Search
Close this search box.

ప్రొద్దుటూరులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుమార్కెటింగ్ ప్రాం తీయ సంయుక్త సంచాలకుడు రామాంజనేయులు..  

ప్రొద్దుటూరులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు  జిల్లాలోని రైతులు, కౌలు రైతు లకు సంబంధించిన పత్తిని కోనుగోలు చేసేందుకు ప్రొద్దటూరులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెటింగ్ ప్రాం తీయ సంయుక్త సంచాలకుడు రామాంజనేయులు తెలిపారు. 

 పత్తి పంటకు కనీస మద్దతు ధర పొడుగు గింజ క్వింటాల్ రూ. 7521 కాగా పొట్టి గింజ రూ. 7121గా ధర ఉందని తెలిపారు. 

 రైతులు తమ పత్తిని బాగా ఆరబెట్టి దుమ్ము, ధూళి లేకుండా శుభ్ర పరిచి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. 

పత్తికి ప్లాస్టిక్ సంచులను వినియోగించరాదని తెలి పారు. 

పత్తికి కనీస మద్దతు ధర రావాలంటే పత్తి గింజ పొడవు 29.30 ఎంఎం నుంచి 30.50 ఎంఎం వరకు ఉండాలన్నారు. 

 రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ తీసుకుని సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి