Search
Close this search box.

నేడు సిట్ బృందం తిరుపతికి రాక..డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ…

తిరుమల మహా ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ అంశంపై విచారించేందుకు ఏర్పాటైన సిట్ బృందం ఈరోజు తిరుపతిలో మొదటిసారిగా భేటీ కానుంది. 

సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. 

నూతనంగా ఏర్పాటైన సిట్ బృందం శనివారం తిరుపతిలో మొదటిసారిగా భేటీ అయిన తర్వాత విచారణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. 

తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నమోదు చేసిన కల్తీ నెయ్యి కేసును సిట్ బృందం స్వాధీనం చేసుకోనుంది. 

కేసును సిట్ స్వాధీనం చేసుకున్న అనంతరం ఆ కేసు విచారణ అధికారిగా ఒక డీఎస్పీ స్థాయి అధికారిని సిట్ చీఫ్ నియమించనున్నారు. 

సిట్ విచారణ పూర్తి అయ్యేంతవరకు సిట్ బృందానికి కావలసిన భవనాలు, ఆఫీస్ మెటీరియల్, కంప్యూటర్ వంటి వస్తువులను టీటీడీ కల్పించనుంది. 

రెండు మూడు రోజుల్లో సిట్‌ బృందం మౌలిక వసతులను సమకూర్చుకొని విచారణను వేగవంతం చేయనుంది. 

మొదటిసారిగా సమావేశం అవుతున్న సిట్ బృందానికి సిట్ చీఫ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దిశా నిర్దేశం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి