Search
Close this search box.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రఖ్యాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies Limited) సంస్థ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా గారితో భేటీ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రఖ్యాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies Limited) సంస్థ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా గారు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో టెక్నాలజీ రంగం అభివృద్ధి, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 

ప్రపంచ అవసరాలను తీర్చగలిగే స్థాయిలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, పెట్టుబడుల విస్తరణ పట్ల రోష్ని నాడార్ గారు ఆసక్తి కనబర్చారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గారు, ఇతర అధికారులు, హెచ్‌సీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కుట్టు శిక్షణా తరగతులు ప్రారంభించిన యంగ్ వన్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ సుచిత్ర
శ్రీ రామ నవమి రోజున రాముల వారి సాక్షిగా ఓ బీసీ బిడ్డకు అవమానం
IMG-20250408-WA0434
పరామర్శించిన కేటీఆర్ సేన అధ్యక్షుడు
Oplus_131072
ఏసీబీ వలలో చింతలపాలెం ఎస్సై
కాటమయ్య రక్షణ కవచం అందరూ వినియోగించా కల్లుగీత కార్మిక

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి