Search
Close this search box.

కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నాణ్యమైన పౌష్టిక అల్పాహారం,మేరకు రెండు సంస్థల మధ్య అవగాన ఒప్పందం (MoU)…

కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నాణ్యమైన పౌష్టిక అల్పాహారం అందించే కార్యక్రమానికి ప్రఖ్యాత వయాట్రిస్‌ (Viatris) ఫార్మా సంస్థ తమ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.6.4కోట్లు విరాళంగా ఇచ్చింది. హరేకృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లోని 28వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ మేరకు రెండు సంస్థల మధ్య అవగాన ఒప్పందం (MoU) కుదిరింది.

వయాట్రిస్ సీఎస్ఆర్ విభాగం బాధ్యురాలు మిచెల్ డొమినికా గారు, హెచ్‌కెఎమ్ ఛారిటబుల్ ఫౌండేషన్ సీఈవో కౌంతేయ దాస గారు పరస్పరం ఎంవోయూ ప‌త్రాలు మార్చుకున్నారు. సీఎస్ఆర్ వ్యవహారాలు పర్యవేక్షించే T-SIG విభాగం హెడ్ అర్చన సురేశ్ గారు, కొడంగల్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KADA) ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి