తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఆ వీరనారికి నివాళులు అర్పించారు. గడీలపై గళమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ గారు బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తారని స్మరించుకున్నారు. మహిళా లోకానికి స్పూర్తిగా నిలుస్తున్న వీరనారి ఐలమ్మగారి పేరును కోఠీలోని మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ యోధురాలి వారసులకు సముచిత గుర్తింపును కల్పించామని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.