పాలకుర్తిలో గత ప్రభుత్వం ఇచ్చిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయిస్తున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు:-
ఓటు వేసి ఎమ్మెల్యే యశాశ్విని రెడ్డిని గెలిపిస్తే ఇదా ప్రతిఫలం అని విలపిస్తున్న కుటుంబాలు.
జనగామ జిల్లా – పాలకుర్తి మండలం లోని తొర్రూరు (జే) గ్రామంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయించి సీల్ వేసిన రెవెన్యూ సిబ్బంది.
గత సంవత్సరం గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేసినా ఇప్పటివరకు పట్టాలు ఇవ్వని అధికారులు.
కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం, పట్టుబట్టి నిరుపేదలను ఖాళీ చేయిస్తున్న వైనం.
ఉన్నపలంగా రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్రమంగా వచ్చి ఇండ్లలోకి చొరబడి ఇంటి సామాగ్రి బయట పడేస్తే మేము ఎక్కడికి పోవాలి.
ఇంట్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులు ప్రాధేయపడినా వినని అధికారులు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే దయ తలచి మాకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు పట్టాలు ఇవ్వాలి.