Search
Close this search box.

కామారెడ్డి జిల్లా బిచ్కుంద, మామ నగర్ పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

పోషణ్ అభియాన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే …..

ఈరోజు బిచ్కుంద మరియు మహ్మద్ నగర్ మండల కేంద్రాల్లో,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ (పోషణ మాసం) కార్యక్రమంలోజుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు పాల్గొన్నారు..

  • ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో పోషణ్ అభియా ఒక పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తుంటారు..
  • ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మహిళలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులు తీసుకోవాల్సిన పౌష్టిక ఆహారం మరియు పోషకాహార లోపాలపై అవగహన కల్పించారు..
  • పౌష్టిక ఆహారం లోపం వల్ల రక్త హీనత, జనన బరువు తగ్గుదల మొదలగు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయని చెప్పారు..
  • గర్భిణీ స్త్రీలు సరైన పౌష్టికాహారం తీసుకుంటే తల్లి బిడ్డ ఎలాంటి పోషకాహర లోపం లేకుండా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు..
  • పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రు పాలు పట్టించాలని,ఆరు నెలలు తల్లి పాలు మాత్రమే బిడ్డకు ఆహారంగా ఇవ్వాలని,తల్లి పాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని, బిడ్డ ఎదుగుద‌ల‌కు ఎంత‌గానో దోహ‌ద ప‌డ‌తాయ‌న్నారు.. 
  • ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టిక ఆహార పదార్థాలను సమయానికి అందజేయాలని అంగన్వాడీ టీచర్లకు మరియు హెల్త్ వర్కర్లకు సూచించారు..
  • పోషకార లోపాలను అదిగమించడానికి అంగన్వాడీ వర్కర్లు మహిళలలో అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు..
  • అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో సిబ్బంది కొరత , మౌలిక సదుపాయల సమస్యలు గురించి తన దృష్టికి వచ్చిందని..
  • త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు