Search
Close this search box.

కామారెడ్డి జిల్లా లింగాపేట్ బాలికల గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

 బుధవారం – తేది 18-9-2024

విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన, వసతి సౌకర్యాలు అందించాలని, నిరంతర హైజీన్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రోజున పట్టణంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల (లింగంపేట్) ను కలెక్టర్ తనిఖీ చేసారు. గురుకులంలోని తరగతి గదులు, డార్మెటరీ, వంటశాల, స్టోర్ రూం, లను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడుతూ, మంచి విద్యను అభ్యసించాలి, ట్రిపుల్ ఐటి లో సీట్ సాధించే విధంగా విద్య ను అభ్యసించాలి అన్నారు. భోజనం ఎలా వుంది, విద్య బోధన ఎలా వుంది అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకుండా విద్యార్థినులు బయటకు వెళ్తున్నారా అని అడిగారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రంగనాథ రావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిని రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, ప్రిన్సిపాల్ డా. వనిత, తహసీల్దార్ జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

..జిల్లా పౌర సంబంధాల అధికారి కామారెడ్డి చే జారీ చేయబడినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు