Search
Close this search box.

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజక్ట్ నీటి విడుదల

సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత

 

ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులకు పోలీస్,రెవెన్యూ అధికారులకు మరియు ప్రజప్రతినిధులకు తెలియజేయునది ఏమనగా .నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతం లో భారీ వర్ష సూచన కారణంగా ఈ రోజు సాయంత్రం 5.00!!గం ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి ,మంజీర నది లోకి వదిలే అవకాశం ఉన్నది .కావున రెవిన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసొకొవలసిందిగా మరియు గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా విజ్ఞప్తి.

 

నదీ పరివాహక ప్రాంతం లోకి పశువులు గాని ,గొర్రెలు మొదలగునవి వెళ్లకుండా అలాగే చేపలు పట్టేవారు, గొర్రె కాపరులు మరియు రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండవలెనని కోరుతున్నాము. నిజాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులకు పోలీస్,రెవెన్యూ అధికారులకు మరియు ప్రజప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాము.

 

నీటిపారుదల శాఖ

నిజాంసాగర్ ప్రాజెక్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు