*హనుమకొండ జిల్లా*
*తేది :29.08.2024*
*బోనాల వేడుకల్లో పాల్గొన్న ఎంపి డా. కడియం కావ్య..*
*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు : ఎంపి డా. కడియం కావ్య*
న్యూ శాయంపేటలో గల పోచమ్మ దేవాలయంలో నిర్వహించిన శ్రావణ మాస బోనాల ఉత్సవాలకు వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపి డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుందని ఆ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.