Search
Close this search box.

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో వినాయక మండప నిర్వహుకుల కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ

*రాజన్న సిరిసిల్ల జిల్లా//-*

 

*వినాయక మండప నిర్వహకులకు కౌన్సిలింగ్*

 

*సిరిసిల్ల పట్టణ సిఐ కె కృష్ణ*

 

సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమజ్జన కమిటీ మండప సభ్యులను మరియు గత సంవత్సరం వినాయక నిమజ్జనంలో పోలీసు వారి సూచనలను ఉల్లంగించి ప్రజలకు ఇబ్బందులు కల్గించిన వారిని పోలీసు స్టేషన్ కి పిలిపించి సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ వారందరికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.

ఇందులో భాగంగా, గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈసారి వినాయక నిమజ్జనంలో ఎటువంటి పొరపాట్లు మరియు ప్రజలకు ఇబ్బందులు జరగకుండా గతంలో జరిగిన ఆనవాయితీ కాకుండా నిర్దేశించిన సమయంలోనే నిమజ్జనాలు జరపాలని నిమజ్జన కమిటీ మండప సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వినాయక నిమజ్జనాలలో నిర్దేశించిన సమయంలో కాకుండా ఒకరోజు తీసి ఊరేగింపు చేసి మళ్లీ అదే స్థానంలో లేదా వివిధ ప్రదేశాలలో ఊరేగింపు వాహనాన్ని పెట్టి మరుసటి రోజు నిమజ్జనం చేస్తామని ఉంచినా లేదా విగ్రహాన్ని నిర్దేశించిన సమయంలోనే తీయకుండా మంటపంలోనే వదిలి వెళ్ళేవారిపైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది. సిరిసిల్ల పట్టణంలోని నిమజ్జన కమిటీ మండప సభ్యులు అందరూ నిమజ్జనం రోజున సిరిసిల్ల పట్టణం లోని అన్నీ వినాయక విగ్రహాలను నిమర్జనం చేయాలి. కాబట్టి ఏ రోజైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో అదేరోజు ఊరేగింపు మరియు నిమజ్జనం పూర్తి చేసుకోవాలి, లేనియెడల వారిపై చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. వినాయక ఊరేగింపులలో ఎటువంటి డీజే లకు అనుమతి లేదని సిరిసిల్ల పట్టణ సీఐ కె కృష్ణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20250430-141720
బిచ్కుంద లొ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన జూక్కల్ MLA తోట లక్ష్మీ కాంతారావు
మహబూబాబాద్ టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ కు రివార్డు
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ వేములవాడలోనీ కొవ్వొత్తుల నివాళి అర్పించారు
ఇంటర్ ఫలితాలు విడుదల