వరద బాధితుల సహాయార్థం మోల్డ్ టెక్ ఇండస్ట్రీస్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం అందజేశారు. మోల్డ్ టెక్ వైఎస్-ప్రెసిడెంట్ జె. రాణా ప్రతాప్ గారు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సచివాలయంలో కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. బాధితుల సహాయం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వారిని అభినందించారు.