Search
Close this search box.

రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు…

రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

✅ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లకు 40 శాతం మేరకు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలన్న అధికారుల నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి గారు యథాతథంగా ఆమోదించారు.

✅ఈ పెంపుదల వల్ల రాష్ట్రంలో 7,65,705 మంది విద్యార్థినీ విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరనుంది. కీలకమైన ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీ మల్లు రవి గారు కూడా ఉన్నారు.

✅దీపావళి పండుగ శుభ సందర్బంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వ‌స‌తి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌స‌తి గృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థ‌ల సొసైటీ (TREIS) ప‌రిధిలోని విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి