Search
Close this search box.

బ్యాంకింగ్, ఫైన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాల్లో నైపుణ్య శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుమల.రేవంత్ రెడ్డి

“సాంకేతిక నైపుణ్యం అందించడానికి హైదరాబాద్ ఒక గమ్యస్థానంగా మారాలి. తెలంగాణను దేశంలోనే ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతాం. ప్రపంచ వేదికపై హైదరాబాద్‌ను ఒక విశ్వనగరంగా నిలబెట్టాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

 

🔹గత పదేళ్లలో తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు. ఆ సమస్య తీవ్రంగా ఉందని ప్రజా ప్రభుత్వం గుర్తించినందునే యవత ప్రాధాన్యతగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

🔹 బ్యాంకింగ్, ఫైన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాల్లో నైపుణ్య శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ యువతకు మార్గనిర్దేశనం చేశారు.

 

🔹జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ (JNAFU) క్యాంపస్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పలువురు ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొన్నారు.

🔹 ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువకులు గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలవుతున్నారు. కొందరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సైతం డ్రగ్స్ సరఫరా చేస్తుండటం బాధాకరం. ఇది తెలంగాణకు ప్రమాదం. కఠినంగా అణిచివేయాల్సిన అవసరం ఉంది.

🔹 వ్యసనాలకు బానిస కాకుండా ఉండేందుకే వారిలో విశ్వాసం పెంపొందించడానికి ఐటీఐలను టాటా టెక్నాలజీస్‌తో కలిసి ఏటీసీలుగా తీర్చిదిద్దడం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నాం.

🔹 ఇంజనీరింగ్ పట్టాలు పొందుతున్నలక్షలాది విద్యార్థులకు బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండకపోవడానికి ప్రధానంగా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్‌లో సరైన నిపుణులు లేకపోవడమే. యాజమాన్యాలు రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగిస్తే ఆ కాలేజీల అనుమతులను రద్దు చేయడం ఖాయం.

🔹 ఐఎస్బీ, ఐఐటీ, నల్సార్, త్రిబుల్ ఐటీ, జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి నాణ్యమైన విద్యా సంస్థలు ఉన్నందునే బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ వస్తున్నాయి. సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ ఒక హబ్‌గా మారాలి.

🔹 ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఎదిగిన అజయ్ బంగా, సత్యనాదెళ్ల, శంతను నారాయణ లాంటి పెద్ద కంపెనీలకు సీఈవోలు హైదరాబాద్‌లో చదువుకున్న వారేనని గుర్తుచేస్తూ అలాంటి ప్రముఖులను వచ్చే డిసెంబర్‌లో నగరానికి ఆహ్వానిస్తాం.

🔹 ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా లాంటి చిన్న దేశం 32 పతకాలను సాధిస్తే, 140 కోట్ల జనాభా కలిగిన మన దేశానికి ఒక్క బంగారు పతకం కూడా సాధించలేకపోయింది. ఈ పరిణామం మనందరికి కనువిప్పు లాంటిది. అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు.

🔹 ఒలింపిక్స్, నేషనల్ గేమ్స్ పాల్గొనదలిచే వారికి శిక్షణ పొందడానికి అన్ని వసతులతో వచ్చే సంవత్సరంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ కూడా ప్రారంభిస్తాం.

🔹 ఈ ప్రభుత్వం యువతను దృష్టిలో పెట్టుకుని అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాల్సిన అంశాలు ప్రధానంగా యువతకు ఒక దిశను చూపెట్టాల్సిన అవసరం ఉంది.

🔹 తెలంగాణ యువతను తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం అలుపెరుగని రీతిలో పనిచేస్తుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ఒక రోల్ మాడల్ గా తీర్చిదిద్దుతాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఉమ్మడి కరీంనగర్‌లో భూ ప్రకంపనలు
ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి
Screenshot_20250430-141720
బిచ్కుంద లొ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన జూక్కల్ MLA తోట లక్ష్మీ కాంతారావు
మహబూబాబాద్ టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ కు రివార్డు
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం