ప్రముఖ రచయిత్రి, దివంగత పౌర హక్కుల నేత బొజ్జా తారకం గారి సతీమణి బి. విజయభారతి గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం తెలిపారు.
ప్రముఖ రచయిత దివంగత బోయి భీమన్న గారి కుమార్తె, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా గారి మాతృమూర్తి అయిన విజయభారతి గారు తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా సేవలు అందించడంతో పాటు ప్రాచీన సాహిత్య కోశం, ఆధునిక సాహిత్య కోశం వెలువరించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు.
సాహితీ రంగానికి విజయభారతి గారు చేసిన సేవలు అపారమైనవని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.