Search
Close this search box.

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను రెండో విడతగా మరికొన్ని నియోజకవర్గాలకు మంజూరు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు…

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను రెండో విడతగా మరికొన్ని నియోజకవర్గాలకు మంజూరు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 

🔸ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థుల డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంపుతో పాటు విద్యా వ్యవస్థ ప్రక్షాళన వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ 14 చాచా నెహ్రూ జయంతి రోజున 15 వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు.

🔸ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల నుంచి మహాత్మా జ్యోతిబా పూలే, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పాఠశాల, కళాశాల విద్యార్థులు డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం గారు వారితో ముఖాముఖి మాట్లాడారు.

🔸విద్యా రంగంలో చేపట్టిన సమూల మార్పులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎంగారు వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతోనే డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని చెబుతూ విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.

🔸ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ, 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించడం.

🔸ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరంలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం.

🔸చదువుతో పాటు నైపుణ్యత ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని, అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్పు.

🔸క్రీడల పట్ల కూడా విద్యార్థులను ప్రోత్సహించాలి. ఒలింపిక్స్ క్రీడలు లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం.

🔸వ్యసనాలకు బానిసలైతే జీవితాలు నాశనమవుతాయి. మాదక ద్రవ్యాలను పూర్తిగా నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలి.

🔸ఈనాటి విద్యార్థినీ విద్యార్థులంతా భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.

🔸ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు, ఎంపీలు పోరిక బలరాం నాయక్ గారు, రామసహాయం రఘురాంరెడ్డి గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

శ్రీ రామ నవమి రోజున రాముల వారి సాక్షిగా ఓ బీసీ బిడ్డకు అవమానం
IMG-20250408-WA0434
పరామర్శించిన కేటీఆర్ సేన అధ్యక్షుడు
Oplus_131072
ఏసీబీ వలలో చింతలపాలెం ఎస్సై
కాటమయ్య రక్షణ కవచం అందరూ వినియోగించా కల్లుగీత కార్మిక
IMG-20250405-WA0368
ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి