Search
Close this search box.

పొలంబాట పనులకు శంకుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే 

Hm9news ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో ప్రజా పాలన- ప్రజా విజయోత్సవ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉపాధి హామీ పథకంలో పొలంబాట పనులకు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పూర్తి చేసుకున్న కూలీలకు సత్కరించారు.ఉపాధి హామీ కూలీల పనిదినాలు, తది తర వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలను 100 రోజుల పనులను పూర్తి చేసుకోవాలని తెలిపారు. పనుల్లేని కూలీలకు ఉపాధి హామీ పనులు ఎంతగానో తోడ్పడుతాయన్నారు. ఉపాధి పనులపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఉపాధి పనులు చేసే ప్రాంతంలో సౌకర్యాల కల్పన, పని వేళలు తదితర అంశాలపై కూలీలతో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి