పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించి గర్వకారణంగా నిలిచిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటి రూపాయల చెక్కును అందించారు. అలాగే కోచ్ నాగపురి రమేష్ గారికి రూ. 10 లక్షల చెక్కును అందజేశారు.
కోటి రూపాయల నగదుతో పాటు ప్రకటించినట్టుగా గ్రూప్ -2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల స్థల కేటాయింపుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. తమకు అందిస్తున్న ప్రోత్సాహంపై దీప్తి జీవాంజి, కోచ్ రమేష్ గార్లు సీఎంగారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి గారు, క్రీడా శాఖ అధికారులు హాజరయ్యారు.