Search
Close this search box.

న్యాయవాద పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా సంతోష్ శర్మ 

 Hm9న్యూస్ ప్రతినిధి కామారెడ్డి జిల్లా: న్యాయవాద పరిషత్ ఎన్నికలను ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ కార్యాలయంలో నిర్వహించారు. బిక్నూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన యువ న్యాయవాది సంతోష్ శర్మ ను జిల్లా న్యాయవాద పరిషత్ ప్రధాన కార్యదర్శి గా రాష్ట్ర న్యాయవాద పరిషత్ అధ్యక్షుని ఆదేశాల మేరకు రాష్ట్ర కోశాధికారి మంగులాలు సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది బి.దామోదర్ రెడ్డి , కోశాధికారిగా గంగరాజు, సెక్రటరీగా భార్గవ్ చంద్ర భూపాల్, వైస్ ప్రెసిడెంట్స్ గా సందీప్ రెడ్డి,మనోజ్ రాథోడ్ లను ఎన్నుకున్నారు, ఈ సందర్భంగా సంతోష్ శర్మ మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం , ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేసి జిల్లా న్యాయవాద పరిషత్ కు పేరు తెస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి