డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. డిసెంబర్ 9 న విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించిన నేపథ్యంలో పనుల పురోగతిని పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న వారిని పలకరిస్తూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.