Search
Close this search box.

జిల్లా పౌర సంబంధాల అధికారి కామారెడ్డి గారిచే జారీ చేయబడిన ప్రకటన.

  తేది 18-9-2024

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 13 న ప్రచురించబడిన ముసాయిదా ఓటరు జాబితా లపై ఈ నెల 21 వరకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తు సమర్పించ వచ్చని జిల్లా ఎన్నికల అధారిటీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో ముసాయిదా జాబితాలను స్థానిక గ్రామ పంచాయతీ, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ఈ నెల 13 న ముసాయిదా జాబితా ప్రకటించడం జరిగిందని, అట్టి జాబితాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే ఈ నెల 21 లోగా సంబంధిత పంచాయతీ కార్యదర్శి లకు అందజేయాలని తెలిపారు. అట్టి అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 26 లోగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. తుది ఫోటో ఎలెక్టోరల్ జాబితాను ఈ నెల 28 న ఆయా గ్రామ పంచాయతీ, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత జాబితా సాఫ్ట్ కాపీ లను రాజకీయ పార్టీలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ రావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

..జిల్లా పౌర సంబంధాల అధికారి కామారెడ్డి చే జారీ చేయబడినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు