Search
Close this search box.

కుల గణన సర్వే తర్వాతే రిజర్వేషన్ల పెంపు: డిప్యూటీ సీఎం భట్టి….

*Bhatti Vikramarka | కులసర్వే తర్వాతే రిజర్వేషన్ల పెంపు: డిప్యూటీ సీఎం భట్టి..!!*

రేషన్‌ కార్డు, ఇల్లు ప్రామాణికం కాదు….

Bhatti Vikramarka | హైదరాబాద్‌, నవంబర్‌ : సమగ్ర కుటుంబ సర్వే ఫలితాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపుపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ప్రజాభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బుధవారం నుంచి ఇండ్ల జాబితాను తయారు చేస్తారని, ఇంటి నంబరు, కుటుంబ యజమాని పేర్లతో కూడిన స్టిక్కర్లను అందజేస్తారని తెలిపారు. 9వ తేదీ నుంచి సర్వే మొదలవుతుందని చెప్పారు.

ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, పాస్‌బుక్‌లు వంటివి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కుటుంబ నిర్ధారణకు రేషన్‌కార్డుగానీ, ఇల్లుగానీ ప్రామాణికం కాదని చెప్పారు. ఒకే ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ కుటుంబాలు ఉండొచ్చని, గతంలో ఒకే రేషన్‌ కార్డులో పేర్లు నమోదైనా ఇప్పుడు వేర్వేరు కుటుంబాలుగా కూడా ఉండొచ్చని తెలిపారు. అలాంటివారు విడివిడిగానే నమోదు చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250405-WA0368
ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు
గావిచర్ల గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఒకరు మృతి
గావిచర్ల గుండ బ్రహ్మయ్య జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 
పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళా సంఘాల సభ్యులు.

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి