ఎల్లారెడ్డి నియోజకవర్గ కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులు పై భారీ నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి భేటీ అయిన స్థానిక MLA మదన్ మోహన్ గారు:
ఈరోజు తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి కార్యాలయంలో *ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన కాళేశ్వరం ప్యాకేజీ 22* పనులు పై జరిగిన రివ్యూ మీటింగ్ లో *మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు.*
భూంపల్లి, కాటేవాడి, మోతే, ప్రాంతలలో రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు కోరడం జరిగింది. *ఈ పనులు పూర్తి అయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది అని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి గారికి తెలిపారు.* ఈ సమావేశంలో ఇంజనీర్ & చీఫ్ అనిల్ గారు, ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇట్లు
MLA క్యాంప్ కార్యాలయం
ఎల్లారెడ్డి నియోజకవర్గం