Search
Close this search box.

ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఇంజనీర్

Hm9news ప్రతినిధి వరంగల్ జిల్లా: అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు మరింత పెంచారు. ప్రభుత్వ శాఖల్లో లంచవతారాలను వలపన్ని పట్టుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ పంచాయతీరాజ్ ఇంజనీరు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఏఈ కార్తీక్ రూ.5 వేల లంచం పుచ్చుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్టు బిల్లుల ఫైల్ క్లియరెన్స్ కోసం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సతీష్ ను అసిస్టెంట్ ఇంజనీర్ కార్తీక్ డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో సతీష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ వద్ద సతీష్ నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటూ ఏఈ కార్తీక్ ఏసీబి అధికారులకు అడ్డంగా చిక్కాడు. అనంతరం హనుమకొండలోని వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
ఉత్తమ బ్యాంక్ మేనేజర్ రాష్ట్ర స్థాయి అవార్డు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు
ఉమ్మడి కరీంనగర్‌లో భూ ప్రకంపనలు
ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి
Screenshot_20250430-141720
బిచ్కుంద లొ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన జూక్కల్ MLA తోట లక్ష్మీ కాంతారావు