Search
Close this search box.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూకంపం

         ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు

Hm9news ప్రతినిథి వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం భూమి కంపించింది.. ఆందోళనతో ఇండ్ల నుంచి బయటకు వచ్చిన జనం ఏమి జరిగిందని చర్చించుకుంటున్నారు.
7:28గంటలకి 10 సెకన్ల పాటు కంపించిన భూమితో ప్రజలు ఆందోళన చెందారు. స్వల్ప కాలమే భూమి కంపించి నట్లు కనిపించినా గతంలో ఎన్నడూ ఈ ప్రాంతంలో ఇలాంటి అనుభవం ఎదురుకాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. మంచంపై నిద్రించిన వారికి, కూర్చున్న వారికి కొద్ది సెకన్ల పాటు అటూ ఇటూ ఊపినట్లి అనుభూతి చెందారు. దీంతో బయటికి వచ్చి చర్చించుకోవడం కనిపించింది.. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో వస్తువులు కూడా భూమి కంపించిన సమయంలో కింద పడ్డాయి.తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం ఈరోజు ఉదయం 7:28 నిమిషాలకు స్వల్పంగా భూమి కంపించింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో భూప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదు అయినట్లు, తెలిసింది. ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారని తెలిసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి