Search
Close this search box.

ఉమ్మడి కరీంనగర్‌లో భూ ప్రకంపనలు

 HM9 న్యూస్ ప్రతినిధి కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భూప్రకంపనలు సంభవించాయి. జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది.ధర్మపురి, సిరిసిల్ల, సుల్తానాబాద్‍లోనూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 3.5గా భూకంప తీవ్రత నమోదైంది. దాదాపు ఐదు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని సామగ్రి సైతం కదిలిపోవడంతో ఏ జరుగుతుందో అర్థంకాక భయంతో బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు నెలల వ్యవధిలో ఇలా భూమి కంపించడం రెండోసారి కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. అలాగే నిర్మల్‌ జిల్లాలోనూ పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఉమ్మడి కరీంనగర్‌లో భూ ప్రకంపనలు
ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి
Screenshot_20250430-141720
బిచ్కుంద లొ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన జూక్కల్ MLA తోట లక్ష్మీ కాంతారావు
మహబూబాబాద్ టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ కు రివార్డు
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం